కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి తిరుమల తిరుపతి దేవస్ధానం ఉద్యోగులు ఒక రోజు వేతనం 83 లక్షల 86 వేల 747 రూపాయలు విరాళం ఇచ్చినారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్కు విరాళానికి సంబంధించిన డీడీను తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టిటిడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అందజేసినారు.