ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ మహానగరంలో వీధి కుక్కలపై దాడులు కలకలం రేపుతున్నాయి. శివారు ప్రాంతమైన రామవరప్పాడు గ్రామ పరిధిలో దాదాపు 20 వీధికుక్కలను నిన్న పంచాయతీ సిబ్బంది విషపూరిత రసాయన ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశారు. ఈ వ్యవహారం కాస్తా నగర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జంతుప్రేమికులు మండిపడుతున్నారు.