కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జమ్మవరం గ్రామంలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో పాడుబడిన పొగాకు గోడౌన్ లో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బాణసంచా సామాగ్రిని రిటైల్ మార్కెట్ కి భారీ ధరలకు అమ్ముతున్న ముఠాని పోలీస్ లు పట్టుకున్నారు. సుమారు కోటి రూపాయల విలువ చేసే భారీ సరుకుకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే బిల్లు ఉండి మిగతా వాటికి బిల్లులు లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురైనారు. నిల్వ ఉన్న భారీ సరుకును పోలీసులు స్వాధీనం చేసుకొని, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.