Ongole boy kidnap : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం రెడ్డి నగర్లో నెల రోజుల క్రితం కిడ్నాప్కి గురైన బాలుడి తల్లిదండ్రులు అశోక్ రెడ్డి, నాగజ్యోతి తమ బిడ్డను రక్షించాలని పోలీసులను వేడుకుంటున్నారు. అందులో భాగంగా.. ఈ రోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ని కలవడానికి ఒంగోలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో.. ఆయనతో ఫోన్లో మాట్లాడారు. వారి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ జాయింట్ కలెక్టర్ని కలవమని సూచించట్లు తెలిపారు. బాలుడి తండ్రి మాట్లాడుతూ.. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, తమ కుమారుడు కిడ్నాప్ అయిన రోజుకు ముందు రోజు.. తమ గ్రామంలో ఓ పురుషుడు, మహిళ అనుమానాస్పదంగా తిరిగారని, ఈ విషయం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌసల్ కి కూడా తెలిపామని తల్లిదండ్రుకు News18కు తెలిపారు. తమ బిడ్డను రక్షించాలని జిల్లా పోలీస్ అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.