అనంతపురం జిల్లా మడకశిర రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. సమయానికి ఇవ్వాల్సిన వేరుశనగ విత్తనాలు ఇవ్వకపోవడంతో... దిక్కుతోచని రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చెయ్యాలనీ, వెంటనే వేరుశనగ విత్తనాలు ఇచ్చేలా చెయ్యాలని డిమాండ్ చేస్తూ... అగ్రికల్చర్ ఆఫీస్ గేటుకు ముళ్ల కంపలను వేసి... వంటావార్పూ నిర్వహించారు.