Lok Sabha Election 2019 : దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పోలింగ్ బూత్ లకు తరలివచ్చారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రావడం హర్షదాయకం. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయిస్తున్నా... పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా సాగుతోంది.