గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం కృష్ణనగర్లోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో ఉన్న పింకీ అనే (18) యువతి కంటికి తీవ్రగాయం అవ్వడంతో చూపు కోల్పోయింది. చికిత్స నిమిత్తం ఆమెను గుంటూరు జీజిహెచ్కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.