పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని 29వ వార్డు మల్లికాసులపేటలో మంటలు చెలరేగి దాదాపు 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇంటి లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు 30 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టుగా సమాచారం. ఒక ఇంటిలోని మహిళ గ్యాస్ స్టవ్ వెలిగించడం వలన పొరపాటున మంటలు చెలరేగి దగ్ధమైంది అని స్థానికులు ఆరోపిస్తున్నారు.