రాయితీ లడ్డూ విధానానికి నేటితో తిరుమల తిరుపతి దేవస్థానం స్వస్తి పలకనుంది. లడ్డూ ప్రసాదంలో నేటి అర్ధరాత్రి నుంచి కొత్త విధానం అమలు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక్క లడ్డూ మాత్రమే అందిస్తామని, అదనపు లడ్డూ కోసం రూ.50 చొప్పున చెల్లించాలని వివరించారు.