భూ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి విసిగిపోయిన ఓ రైతు.. చివరకు ఆత్మహత్యాయత్నం చేశాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ఎదుటే జయరామిరెడ్డి అనే రైతు పురుగుల మందు తాగాడు. కార్యాలయ సిబ్బంది హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్టలో ఈ ఘటన జరిగింది.