సహజంగా ఎన్నికలు అయిపోయాక నేతలెవరూ తమ దగ్గరకు రారని ప్రజలు అంటుంటారు. ఐతే... మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాత్రం బైక్పై వెళ్లి... కృష్ణా జిల్లాలోని పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై ఉంటున్న ప్రజలను కలుస్తున్నారు. తనకు ఓటు వేసిన వారికీ, వెయ్యనివారికీ అందరికీ థాంక్స్ చెబుతూ ముందుకెళ్తున్నారు. తాను తప్పు చేసి ఉంటే క్షమించమని అడుగుతున్నారు. తనకు తెలిసి తాను ఏ తప్పూ చెయ్యలేదని అంటూ ప్రజలను కలుస్తున్నారు.