గుంటూరు జిల్లా సత్తెనపల్లి పెట్రోల్ బంక్ లో ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనానికి పెట్రోల్ నింపే సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని ఆపుచేయడం వలన పెనుప్రమాదం తప్పింది. పెట్రోల్ నింపే సమయంలో ఫోన్ యూజ్ చేయడం వలన ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం.