పోలీసుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాజధాని గ్రామాల రైతులు నిర్ణయించుకున్నారు. వాళ్లకు కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా కల్గించకూడదనుకున్నారు. తమ దుకాణాల ముందు కూర్చోవడానికి కూడా పోలీసులకు అనుమతి ఇవ్వడం లేదు.దీంతో పోలీసులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు పోలీసులు ఆందోళనలు చేస్తున్న రైతుల కాళ్లు పట్టుకుున్నారు. శుక్రవారం మహిళల పట్ల ప్రవర్తించిన అనుచిత తీరుకు క్షమాపణలు చెప్పారు.