కృష్ణా జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ లో నివాసముంటున్న మేకా రామలింగేశ్వర రెడ్డికి ఉయ్యూరు మండలం కాటూరులో వ్యవసాయ భూమి వుంది. అయితే ఆ భూమి వివాదంలో వుండటంతో దాన్ని పరిష్కరించుకునేందుకు జిల్లా భూసంస్కరణల అధికృత అధికారిణి(ఏఓ)గా పనిచేస్తున్న ప్రశాంతిని కలిశారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.3లక్షల లంచం డిమాండ్ చేశారు. మెకా రామలింగేశ్వరరెడ్డి పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని ప్రశాంతిని రెడ్ హ్యాండ్డెడ్ గా పట్టుకున్నారు.