తిరుమల కొండ మీద ఓ పెద్ద కొండ చిలువ భక్తుల్నీ భయభ్రాంతుల్నీ చేసింది. వివరాల్లోకి వెళితే.. తిరుమల కొండ మీద పాపవినాశనంకు వెళ్లే మార్గంలో ఉన్న వేణు గోపాల స్వామి గుడివద్ద బారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. ఈ పాము భారీగా ఉండడంతో భక్తులు తీవ్ర భయాందోళలకు గురైయారు. అయితే సమాచారం అందుకున్న పాములు పట్టే టీం.. అక్కడికి చేరుకొని పామును ఒడుపుగా పట్టుకొని ఆడివిలో వదిలారు.