తాను కశ్మీర్ వ్యాలీని సందర్శించేందుకు వచ్చానని, గుల్మార్గ్లో గడపాలనుకుంటున్నానని ఓ పర్యాటకుడు చెప్పాడు. అతను ఈ రెస్టారెంట్ని కనుగొన్నప్పుడు, అతనికి చాలా భిన్నమైన అనుభవం ఎదురైంది. అందులో కూర్చుంటే స్వర్గపు కిటికీలోంచి చూస్తున్నట్లు అనిపించిందని సైఖ్ అనే పర్యాటకుడు చెప్పాడు. ఈ గాజుతో కప్పబడిన రెస్టారెంట్లో చల్లగా ఉండదు. ఒక కప్పు కాఫీతో బయటి దృశ్యం మరింత అద్భుతంగా కనిపిస్తుంది.