చనిపోయిన వ్యక్తులు తిరిగి బతుకుతారనే నమ్మకంతో మమ్మీలుగా మార్చే ప్రక్రియ కేవలం ఈజిప్టుకే పరిమితం కాలేదా? ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ మమ్మీలు ఉన్నాయా? ఫారో రాజులు ఫాలో అయింది ప్రాచీన గిరిజన తెగల సంస్కృతినేనా అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానం వినిపిస్తోంది. పెరూలో లభించిన మమ్మీనే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో పురావస్తు శాఖ సిబ్బంది ఓ పురాతన మమ్మీని వెలికితీశారు. పెరూ రాజధాని లీమా నగర శివారుల్లోని చారిత్రక ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టగా ఈ మమ్మీ బయటపడింది. లిమా నగర శివార్లలో లభించిన భూగర్భ సమాధిలో ఈ మమ్మీ లభ్యమైంది. దీని వయసు రీత్యా ఈజిప్ట్ వెలుపల లభ్యమైన వాటిలో అతి తక్కువ వయసున్న మమ్మీగా ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు.
పెరూ రాజధాని లీమా శివారుల్లో మమ్మీని వెలికి తీసిన సమాధిలోనే సిరామిక్ వస్తువులు, కూరగాయల అవశేషాలు, రాతి పనిముట్లు కూడా దొరికాయని ఆ దేశ పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. ఈజిప్ట్ బయట దొరికన మమ్మీల్లో కొన్ని.. ఇటీవలి చరిత్రలోనే ఈజిప్ట్ నుంచే తరలించినవిగా తేలిన నేపథ్యంలో పెరూలో దొరికి 800 ఏళ్ల నాటి మమ్మీ మాత్రం అలా తరలించింది కాదని ఆర్కియాలజిస్టులు స్పష్టం చేశారు.
ఈజిప్ట్ వెలుపల లభ్యమైన మమ్మీల్లో అతి తక్కువ వయసున్నదిగా భావిస్తోన్న ఈ మమ్మీపై లోతైన పరిశోధనలు జరుపుతున్నామని పెరూ ఆర్కియాలజిస్టులు చెప్పారు. కాగా, అరుదైన నాగరితకు కేంద్రంగా నిలిచి, ప్రపంచంలోనే ప్రసిద్ధ పర్యాటకంగా కొనసాగుతోన్న పురాతన చారిత్రాత్మిక కట్టడమైన ‘మచు పిచ్చు’కు సమీపంలోనే ఈ మమ్మీ బయటపటంతో రాబోయే రోజుల్లో పరిశోధనలు కొత్త మలుపు తీసుకోనున్నాయి..