తెలంగాణ సచివాలయ పనులను సీఎం కేసీఆర్ మంగళవారం నాడు పరిశీలించారు.
2/ 13
వచ్చే నెల 17వ తేదీన తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
3/ 13
ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్ పుట్టిన రోజు. కేసీఆర్ పుట్టిన రోజునే కొత్త సచివాలయ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు.
4/ 13
ఈ మేరకు ఈ నెల 15వ తేదీన ఈ నిర్ణయం తీసుకున్నారు.
5/ 13
సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను 10 రోజుల్లోనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
6/ 13
కొత్త సచివాలయ నిర్మాణ పనులను కేసీఆర్ ఇవాళ పరిశీలించారు.
7/ 13
కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బీహర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ , జేడీ(యు) అద్యక్షుడు లలన్ సింగ్ , అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ లు హజరు కానున్నారు.
8/ 13
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా యుద్ధనౌక గద్దర్ సీఎం కేసీఆర్ను కోరారు.
9/ 13
ఈ మేరకు తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ భవన్ గా నామకరం చేసింది ప్రభుత్వం.
10/ 13
దీంతో ఈ సచివాలయ ప్రారంభోత్సవం రోజు అంబేద్కర్ మనుమడిని కూడా ఆహ్వానించారు.
11/ 13
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొత్త సచివాలయానికి తొలుత వాస్తు పూజ నిర్వహిస్తారు.
12/ 13
ఆ తర్వాత సుదర్శన యాగం, చండీ యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాలు పూర్తైన తర్వాత సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.
13/ 13
కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తైన తర్వాత సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ లో సభ ను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల సీఎంలు ఈ సభలో పాల్గొంటారు.