Bharat Jodo Yatra: హైదరాబాద్లో రెండో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే
Bharat Jodo Yatra: హైదరాబాద్లో రెండో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్లో రెండో రోజు ప్రారంభమైంది. మరి ఆయన పాదయాత్ర ఏయే మార్గాల్లో సాగుతుంది? ఇవాళ ఎన్ని కిలోమీటర్ల మేర నడుస్తారో తెలుసుకుందాం.
హైదరాబాద్లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలయింది. ఉదయం 6 గంటలకు బోయిన్పల్లిలోని గాంధీయాన్ ఐడియాలజీ సెంటర్ నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమైంది.
2/ 7
ఇవాళ 27.8 కిలోమీటర్ల మేర నడవనున్నారు. న్యూబోయిన్ పల్లి, బాలానగర్ మెయిన్ రోడ్డు, ఫిరోజ్ గూడ, జింకలవాడ, ముంబై హైవే, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా మదీనగూడ వరకు యాత్ర ఉంటుంది.
3/ 7
ఉదయం 10 గంటలకు మదీనగూడలోని హోటల్ కినారా గ్రాండ్ వద్ద పాదయాత్రకు విరామం ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు BHEL బస్ స్టాండ్ నుంచి మళ్లీ యాత్ర ప్రారంభమవుతుంది.
4/ 7
సాయంత్రం 7 గంటల సమయంలో ముత్తింగి పాదయాత్రకు విరామం ఇస్తారు. అక్కడే కార్నర్ మీటింగ్ ఉంటుంది. రాత్రికి రుద్రారంలోని గణేష్ మందిర్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేస్తారు.
5/ 7
హైదరాబాద్లో నిన్న జరిగిన భారత్ జోడో యాత్రకు భారీగా స్పందన వచ్చింది. జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాంగ్రెస్ శ్రేణులతో పాతబస్తీ వీధులు నిండిపోయాయి.
6/ 7
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన మల్లిఖార్జున ఖర్గే.. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. నగరానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలంతా రాహుల్ గాంధీ వెంట నడిచారు.
7/ 7
రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ను దారి మళ్లించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.