తెలంగాణపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెడుతున్న సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ నెల 8న తెలంగాణ... హైదరాబాద్కి రానుండటం చర్చనీయాంశం అయ్యింది. ఈ పర్యటనలో ప్రధాని ప్రధానంగా రైల్వే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. అందులో భాగంగా 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య పరులుగు పెట్టనున్న వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. (image credit - twitter - narendramodi)
ఈ వందే భారత్.. ఆయా స్టేషన్లలో ఎక్కువసేపు ఆగదు కదా.. అందువల్ల ఇది 8.30 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఇది నల్గొండ, , ఒంగోలు, స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. 8న మాత్రం నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందే భారత్ కావడం వల్ల దీని కోసం అంతా ఎదురు చూస్తున్నారు. (image credit - twitter - narendramodi)
ఇక తన పర్యటనలో ప్రధాని మోదీ.. MMTS రెండో దశను ప్రారంభిస్తారు. మొత్తం 95 కిలోమీటర్లకు సంబంధించిన ఈ దశ కోసం రైల్వేశాఖ రూ.816 కోట్లు అంచనా వ్యయంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. సికింద్రాబాద్-మేడ్చల్ రూట్లో లాలాగూడ గేట్, మల్కాజ్గిరి, దయానందనగర్, సఫిల్ గూడ, ఆర్కే పురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లు వస్తాయి. (image credit - twitter - narendramodi)
సీఎం కేసీఆర్ వస్తారా? : ప్రధాని పర్యటనలో రాజకీయ అంశాలు లేనప్పటికీ.. ఇది రాజకీయంగా చర్చకు దారితీసింది. ప్రధాని మోదీ వచ్చినప్పుడు.. సీఎం కేసీఆర్ ఆయన్ని ఆహ్వానించేందుకు ఎయిర్పోర్టుకు వస్తారా రారా అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇదివరకు రెండుసార్లు మోదీ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ రాలేదు. అందుకు ప్రత్యేక కారణాలు చెప్పారు. మరి ఈసారైనా వస్తారా అంటే డౌటే. (PC: Twitter/ Telangana Cmo)
తెలంగాణ , సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం" width="1600" height="1600" /> ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్గా మారాక.. బీజేపీని ప్రధాని ప్రత్యర్థిగా చూస్తూ.. ప్రధాని మోదీపై డైరెక్టుగానే విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అటు బీజేపీ నేతలు కూడా కౌంటర్లతో రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే.. అది ప్రజల్లోకి నెగెటివ్ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అందువల్ల సీఎం కేసీఆర్.. ఈ పర్యటనకు దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. (ఫైల్ ఫొటో)