Diwali 2022: స్మశానంలో దీపావళి పండుగ .. సమాధుల దగ్గర సంబురాలు .. ఎక్కడో ..? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
Diwali 2022: స్మశానంలో దీపావళి పండుగ .. సమాధుల దగ్గర సంబురాలు .. ఎక్కడో ..? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
Diwali 2022: కరీంనగర్లో ఆరు దశబ్దాలకు పైగా స్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు.
దీపావళి పండుగ అంటే అందరి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి సంతోషాలతో కూడిన వెలుగులు రావాలని కోరుతూ చేసుకునే పండుగ. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర దీపాలు వెలిగించి బాణా సంచా పేల్చడం ఆనవాయితీగా వస్తోంది.
2/ 12
ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి చోట దీపావళి నాడు ప్రతి ఒక్క కుటుంబం ఆనందోత్సాల మధ్య ఇంటిని విద్యుత్ దీపాలు లేదంటే ప్రమిదలతో దీపాలు వెలిగించి పండుగను జరుపుకుంటారు. కాని తెలంగాణలోని ఆ జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది.
3/ 12
సాధారణంగా దీపావళి పండుగ రోజున అందరూ దేవుళ్లను పూజిస్తారు. కాని కరీంనగర్లో ఆరు దశబ్దాలకు పైగా స్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు.
4/ 12
వినడానికి కొత్తగా, వింతగా అనిపించిన చాల కుటుంబాలు ఈ తంతును ఆచరిస్తున్నాయి. కరీంనగర్ లోని కార్జన గడ్డలో ఉన్న హిందు స్మశాన వాటిక లో యేటా దళిత కుటుంబాలు స్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటాయి.
5/ 12
పండగకు వారం రోజుల ముందే స్మశాన వాటిక వద్ద అంత శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంత శుభ్రం చేసిన తరువాత పూలతో సమాధులను అలంకరిస్తారు.
6/ 12
దీపావళి నాటికి సమాధులకు రంగులు, సున్నాలు వేయించి పూలతో అలంకరిస్తారు. పండగ రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుని అక్కడే గడుపుతారు. ఎంతో సరదాగా గడుపుతారు.
7/ 12
సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంత శుభ్రం చేసిన తరువాత పూలతో సమాధులను అలంకరిస్తారు . దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి పండగ రోజును సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెబుతుంటారు.
8/ 12
అందుకే దీపావళి పండుగ వచ్చిందంటే చాలు అందుకోసమే కార్జన గడ్డలో ఉన్న హిందూ స్మశాన వాటికలో చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు కూడా వండి సమాధుల వద్ద నైవేధ్యంగా పెడతారు.
9/ 12
పితృ దేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు.ఇదీ కాస్త వింత గానే ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు.
10/ 12
ఉపాధి కోసం వెళ్లి వివధ ప్రాంతాల్లో స్థిర పడిన వారంత దీపావళి పండగకు మాత్రం కచ్చితంగా కరీంనగర్ కు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకొని పిల్ల పాపలతో సాయంత్రం ఆరుగంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే రెండు గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతుంటారు.
11/ 12
తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వికులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు. ఇలా ఒకటి రెండు సంవత్సరాల నుంచి కాదు సుమారు ఆరు దశాబ్ధాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
12/ 12
దీపావళి రోజున చనిపోయిన వారి సమాధుల వద్దనే ఇంటిళ్ల పాది దీపావళి వేడుకలు చేసుకుంటారు . అక్కడే పిల్లాపాపలతో టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు ఇలా జరుపుకోవడం కరీంనగర్లో కొంత మందికి సంప్రదాయంగా వస్తుంది.