3. ఐఆర్సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే మొదటి రోజు ఉదయం హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే గంటన్నరలో తిరుపతి చేరుకుంటారు. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు తీసుకెళ్తారు. హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం తీసుకెళ్తారు. సాయంత్రానికి తిరిగి హోటల్కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. రెండో రోజు తెల్లవారుజామున తిరుమల తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరిగి హోటల్కు చేరుకుంటారు. తర్వాత తిరుచానూర్లో పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుపతి ఎయిర్పోర్టుకు తీసుకెళ్తారు. తిరుపతి ఎయిర్పోర్టులో ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,820. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10,920 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,600. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్లో బస, వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. నేరుగా తిరుపతి వచ్చేవారికి కూడా ఐఆర్సీటీకీ ఒకరోజు ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధర రూ.990 మాత్రమే. తిరుమల, తిరుచానూర్ ఆలయాలు దర్శించుకోవచ్చు. తిరుమల, తిరుచానూర్ ఆలయాల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. డివైన్ బాలాజీ దర్శన్ పేరుతో ఈ ప్యాకేజీ ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)