కాజీపేట - బల్లార్ష సెక్షన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ (12757), సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (12758), కాజీపేట - సిర్పూర్ టౌన్ (17003), బల్లార్ష - సిర్పూర్ టౌన్ (17004) రైళ్లను జూన్ 27 నుంచి జులై 20 వరకు, అంటే ఏకంగా 24 రోజులపాటు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
పాక్షికంగా రద్దయిన రైళ్ల విషయానికొస్తే, భద్రాచలం రోడ్ -బల్లార్ష మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ (17003) రైలు జూన్ 27 నుంచి జులై 20 వరకు సగం దూరంలోనే ఆగుతుంది. అంటే, ఈ రైలు కొత్తగూడెం(భద్రాలచం రోడ్) నుంచి వరంగల్ వరకు మాత్రమే నడుస్తుంది. సిర్పూర్ టౌన్ భద్రాచలం రోడ్ (17034) రైలు జూన్ 27 నుంచి జులై 20 వరకు సిర్పూర్-వరంగల్ మధ్య రద్దయింది. (ప్రతీకాత్మక చిత్రం)
దారి మళ్లించిన రైళ్ల విషయానికొస్తే, తిరుపతి - జమ్ముతావి (22705) రైలును జులై 5,12, 19 తేదీలలో సికింద్రాబాద్, నిజామాబాద్, ముద్కేడ్, పింపల్ కుట్టి మీదుగా నడుపుతారు. సికింద్రాబాద్ - దానాపూర్ - సికింద్రాబాద్ (12791/12792) రైళ్లను జూన్ 26 నుంచి జులై 19 వరకు పెద్దపల్లి-నిజామాబాద్-సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించి నడుపుతారు. మరో తొమ్మిది రైళ్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)