శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ తీరం దాటింది. సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మధ్య తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి.