తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రెటేరియేట్ లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ అగ్నిప్రమాదంపై పెద్ద హైడ్రామా కొనసాగింది. ఇది మాక్ డ్రిల్ అని పోలీసులు చెబుతుండగా..స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక సచివాలయంలో అగ్నిప్రమాదం ఘటన వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది.