నాలుగు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తో పాటు మరో నాలుగు వేల థర్మల్ కరెంట్ను ,ఆరు వేల సోలార్ పవర్ ఉత్పత్తే లక్ష్యంగా భారీ విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. థర్మల్ పవర్ స్టేషన్లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సీఎం పరిశీలిస్తారు. (ప్రతీకాత్మకచిత్రం)
29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే 5 యూనిట్లను పరిశీలిస్తారు సీఎం కేసీఆర్. ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్లోగా మొదటి యూనిట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.(ప్రతీకాత్మకచిత్రం)