ఈ భేటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల స్థలాల ఏర్పాటు, గన్నీ బ్యాగుల సేకరణ, ట్రాన్స్ పోర్టుకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సీజన్ లో 56.45 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. మొత్తం 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు.