Gandhi Hospital: రేపటి నుంచి ఆ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు బంద్.. మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా మారిన గాంధీ ఆసుపత్రి..
Gandhi Hospital: రేపటి నుంచి ఆ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు బంద్.. మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా మారిన గాంధీ ఆసుపత్రి..
Gandhi Hospital:కరోనా విలయతాండవానికి తెలంగాణ విలవిలలాడుతోంది. ఇంత కాలం కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు కనిపించినా.. ఒక్కసారిగా కోవిడ్ మహమ్మారి కోరలు చాచింది. దీంతో కరోనా పేషెంట్ల తాకిడి ఎక్కవ అయింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. దీంతో గాంధీ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ సేవలు నిలిపి వేశారు. కోవిడ్ పేషెంట్ల తాకిడి ఎక్కువ అవ్వడంతో ఎమర్జెన్సీ సేవలనున నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
గాంధీ హాస్పిటల్ ను పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మార్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఓపీ సేవలు నిలిపి వేసి కేవలం కోవిడ్ కేసులకు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా నిర్ణయించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో 450 మందికి పైగా పేషంట్స్ వివిధ రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
మరోవైపు ప్రతి పది నిమిషాలకు ఒకరు గాంధీ ఆసుపత్రిలో చేరుతున్నారు. నిన్న ఒక్క రోజే 150 మంది కరోనా పేషంట్లు చేరారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
కోవిడ్ పేషంట్లతో గాంధీ హాస్పిటల్ ఐపీ బ్లాక్ నిండిపోయింది. ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపి వేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
6/ 6
దీంతో ఏప్రిల్ 17 నుంచి గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)