1. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ (Money Transfer) చేయడం, పేమెంట్స్ (Online Payments) చేయడం చాలా సులువైపోయింది. స్మార్ట్ఫోన్లో యాప్స్ ఉపయోగించి సులువుగా లావాదేవీలు చేసేస్తున్నారు. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత లావాదేవీలు సులువయ్యాయి కానీ... మోసాలు కూడా పెరిగిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఏటీఎం కార్డు మోసాలు, క్రెడిట్ కార్డ్ ఛీటింగ్స్ ఎక్కువయ్యాయి. అంతేకాదు... ఇటీవల యూపీఐ మోసాలు కూడా పెరిగాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం లాంటి యూపీఐ సేవల్ని వాడుతున్నవారిని సింపుల్గా మోసం చేస్తున్నారు నేరగాళ్లు. దీంతో ఇలాంటి మోసాలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖాతాదారుల్ని అలర్ట్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మోసగాళ్లు ముందుగా లాటరీ తగిలిందంటూ మెసేజెస్ పంపిస్తున్నారు. తాము పంపించే లింక్ క్లిక్ చేసి లాటరీ ద్వారా వచ్చిన మొత్తాన్ని పొందొచ్చని ఆశచూపిస్తున్నారు. వివరాలు ఎంటర్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలని నమ్మిస్తున్నారు. ఈ మోసాల గురించి తెలియనివారు సైబర్ నేరగాళ్లు చెప్పినట్టుగా చేసి తమ అకౌంట్లోని డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. గతంలో ఇలాంటి మోసాలే సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని అమ్మేవారి విషయంలో జరిగాయి. మీ వస్తువుల్ని మేం కొంటామని చెప్పి డబ్బులు యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు నమ్మిస్తారు. డబ్బులు పంపాల్సింది పోయి... యూపీఐలో మనీ రిక్వెస్ట్ పంపిస్తారు. మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలు... డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని నమ్మిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ మాటలు నమ్మి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మీరు వారికి డబ్బులు పంపినట్టవుతుంది. మీ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. యూపీఐ లావాదేవీలు చేసేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు అవతలివారికి డబ్బులు పంపాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. అంతే తప్ప... మీకు డబ్బులు రావాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీ యూపీఐ లావాదేవీలను నమ్మదగే ప్లాట్ఫామ్స్పైనే చేయాలి. పేమెంట్లో యూపీఐ ఆప్షన్ ఉందని కదా అని ప్రతీ ప్లాట్ఫామ్లో ఉపయోగించకూడదు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఇలాంటి లింక్స్తోనే మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక తరచూ మీ యూపీఐ పిన్ మారుస్తూ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)