IND W vs ENG W : ఇంగ్లండ్ తో భారత్ టఫ్ ఫైట్.. గెలిస్తే సెమీస్ టికెట్.. టీమిండియా తుది జట్టు ఇదే
IND W vs ENG W : ఇంగ్లండ్ తో భారత్ టఫ్ ఫైట్.. గెలిస్తే సెమీస్ టికెట్.. టీమిండియా తుది జట్టు ఇదే
IND W vs ENG W : ఇప్పటికే ఆడిన పాకిస్తాన్, వెస్టిండీస్ లతో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత్ మెగా టోర్నీలో దూకుడు మీద ఉంది. ఇంగ్లండ్ పై నెగ్గితో భారత్ దాదాపుగా సెమీఫైనల్స్ కు చేరుకుంటుంది.
మహిళల టి20 ప్రపంచకప్ (Women's T20 World Cup 2023)లో టీమిండియా (Team India) మరో టఫ్ ఫైట్ కు సిద్ధమైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగే పోరులో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ (England)తో టీమిండియా తలపడనుంది.
2/ 8
ఇప్పటికే ఆడిన పాకిస్తాన్, వెస్టిండీస్ లతో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత్ మెగా టోర్నీలో దూకుడు మీద ఉంది. ఇంగ్లండ్ పై నెగ్గితో భారత్ దాదాపుగా సెమీఫైనల్స్ కు చేరుకుంటుంది.
3/ 8
అయితే పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లలాగా ఇంగ్లండ్ బలహీనమైన టీం కాదు. ఇంగ్లండ్ కూడా తాను ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గింది. విండీస్, ఐర్లాండ్ లపై సులభంగా విజయాలను నమోదు చేసింది.
4/ 8
ఈ క్రమంలో శనివారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే టీమిండియాను స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్ కలవరపెడుతోంది.
5/ 8
గతేడాది జరిగిన ఆసియా కప్ లో అదరగొట్టిన తర్వాత.. స్మృతి మంధాన పెద్దగా బ్యాట్ తో రాణించలేదు. అడపాదడపా అర్ధ సెంచరీలు సాధించినా.. నిలకడైన ప్రదర్శనను చేయలేకపోతుంది.
6/ 8
ఇక టి20 ప్రపంచకప్ లో వేలి గాయంతో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ కు దూరమైంది. అనంతరం విండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఆడినా 10 పరుగులు మాత్రమే చేసింది. అయితే లేడీ ధోని రిచా ఘోష్ సూపర్ ఫామ్ లో ఉండటం.. జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లు టచ్ లో ఉండటం భారత్ కు సానుకూల అంశం.
7/ 8
ఇక బౌలింగ్ లో దీప్త శర్మ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుంది. రేణుక సింగ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ లతో భారత బౌలింగ్ పటిష్టంగా ఉంది.
8/ 8
టీమిండియా తుది జట్టు అంచనా : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, దీప్తి శర్మ, దేవిక వైద్య, పుజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్