యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) ఫ్యాన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు బొక్క బొర్లాపడుతుంటే.. మరి కొన్ని జట్లు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయ్. ఇక, టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది. దీంతో, హాట్ ఫేవరేట్ గా ఉన్న టీమిండియా.. పాకిస్థాన్ (pakistan) తో జరిగిన మ్యాచ్ లో ఓడి అసలు సెమీస్ బెర్త్ అయినా దక్కించుకుంటుందా..? అనే డౌట్ మొదలైంది.
ఇక, సెమీస్ రేస్ లో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ అగ్ని పరీక్షే.ఈ నెల 31 న తమ తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొనబోతోంది కోహ్లీసేన. అయితే పాకిస్థాన్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ది కూడా ఇదే పరిస్థితి. దీంతో, ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్ సాగడం ఖాయం. మరోవైపు, ఐసీసీ టోర్నీల్లో గత 18 ఏళ్లుగా టీమిండియాపై న్యూజిలాండ్ కు ఓటమే లేదు.
దీంతో.. భారత్-న్యూజిలాండ్ (India Vs Newzealand) ల మధ్య జరిగే కీలక మ్యాచ్ ను పలువురు సీనియర్ క్రికెటర్లు నాకౌట్ పోరుగానూ అభివర్ణిస్తున్నారు. అయితే ఈ కీ ఫైట్ కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar), మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ (virender Sehwag).. టీమిండియా కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) కి కొన్ని సూచనలు చేశారు.
ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. అంతగా ఫామ్ లో లేని భువనేశ్వర్ (Bhuvaneshwar) తో పాటు ఫిట్ లెస్ గా ఉన్న హార్ధిక్ పాండ్యా (Hardik Pandya)కు విశ్రాంతినివ్వాలని విరాట్ కు సూచించాడు. ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. "ఒకవేళ పాండ్యా బౌలింగ్ వేయకుంటే అతడి స్థానంలో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ను తుది జట్టులోకి తీసుకోవడం ఉత్తమం" అని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2021 కోసం భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా ఎంపికయ్యాడు. కానీ అతడు బౌలింగ్ చేయడానికి ఇంకా ఫిట్గా లేనట్లుగా కన్పించాడు. అందుకే పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ బౌలింగ్ చేయలేదు. ఇక బ్యాట్తోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే యూఏఈలో ఐపీఎల్ 2021లో కూడా పెద్దగా రాణించలేదు. గత కొంత కాలంగా హార్దిక్ ఫామ్లో లేడు.
పాండ్యా తో పాటు టీమిండియా పేసర్ భువనేశ్వర్ (Bhuvaneshwar) ను కూడా పక్కనబెట్టాలని గవాస్కర్ సూచించాడు. ఫామ్ లో లేని అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ను తీసుకోవాలని అన్నాడు. అయితే జట్టులో ఎక్కువ మార్పులు చేయడం కూడా మంచిది కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అలా చేస్తే మనం భయపడుతున్నామని ప్రత్యర్థి జట్టు భావిస్తుందని, అది మొదటికే మోసమని చెప్పాడు.