దాంతో లీగ్ లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లోనూ ఓడింది. తద్వారా ఐపీఎల్ లో వరుసగా ఏడు మ్యాచ్ లు ఓడిన తొలి జట్టుగా నిలిచింది. అంతకుముందు ఈ చెత్త రికార్డు ఢిల్లీ డేర్డెవిల్స్ (2013లో), ఆర్సీబీ (2019లో) ఉండేది. ఈ రెండు కూడా సీజన్ ఆరంభంలో మొదటి ఆరు మ్యాచ్లలో ఓటమి పాలైన జట్లుగా పేరొందాయి. తాజాగా ఆ రికార్డును ముంబై తన ఖాతాలో వేసుకుంది.