ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో లీగ్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్, లక్నో టీమ్స్ తమ డ్రాఫ్ట్ జాబితాలను ప్రకటించాయి. బీసీసీఐ రిటెన్షన్ నిబంధనల మేరకు ఇరు జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను పికప్ చేసుకున్నాయి. ఆర్పీఎస్జీ గ్రూప్కు చెందిన లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్ను రూ. 17 కోట్లకు తీసుకుంది. తమ టీమ్ కెప్టెన్గా ఎంచుకుంది.
దీంతో, ఇప్పటి వరకు ఐపీఎల్ 2022 సీజన్లో అత్యధిక వేతనం పొందిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. గత సీజన్ వరకు ఈ రికార్డు ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీదుంది. గత సీజన్లో కోహ్లీ అత్యధికంగా రూ.17 కోట్లు అందుకోగా.. ఈ సీజన్లో మాత్రం రూ.15 కోట్లకే రిటైన్ చేసుకుంది. టీమ్ కోసం కోహ్లీ వేతనం విషయంలో కాంప్రమైజ్ అయ్యాడు.