ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) కోసం బీసీసీఐ (BCCI) ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రెండు కొత్త జట్లను ఖరారు చేయగా.. ఇక ఆటగాళ్ల రిటెన్షన్ విధానంపై పలు సూచనలను పరిగణలోకి తీసుకొని నిబంధనలను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న 8 జట్లకు తోడు కొత్తగా వచ్చిన రెండు జట్లు చేరాయి. 2011లో నిర్వహించిన లీగ్ ఫార్మాట్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగనున్నాయి. దీంతో, ఐపీఎల్ జట్లన్నీ తమ వ్యూహల్ని ఇప్పటి నుంచే అమలు చేయడానికి రెడీ అయ్యాయ్.
ఆటగాళ్ల రిటెన్షన్ విధానంతో దాదాపు అన్ని జట్లల్లోనూ కొత్త ముఖాలు కనిపించడానికి అవకాశం ఏర్పడినట్టయింది. కొత్త రిటెయిన్ పాలసీ ప్రకారం మెగా ఆక్షన్ను నిర్వహించడానికి ముందే పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వీలు లభించింది. ఈ నలుగురిలో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక ఓవర్సీస్ ప్లేయర్/ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు లేదా ఇద్దరు ఓవర్సీస్ క్రికెటర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్కు గుడ్బై చెప్పనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాహుల్ ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది. రాహుల్ వచ్చే ఏడాది పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించడం లేదని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ క్రిక్ బజ్ తమ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది. ఐపీఎల్ 2021 సీజన్లో 13 మ్యాచ్లలో రాహుల్ 626 పరుగులు చేశాడు.