కరోనా ఎఫెక్ట్ తో అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ ను మళ్లీ పట్టాలెక్కించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్-2021 సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించనున్నట్టు సమాచారం. అక్టోబర్ 10న ఫైనల్ మ్యాచ్ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారంఈ క్రమంలో అక్టోబర్ 10న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుందని తెలుస్తోంది. కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లను ఇంగ్లాండ్ బబుల్ నుంచి దుబాయ్కి తీసుకెళ్లనున్నారు.
ఐపీఎల్ 2021 సెకండాఫ్ కోసం సెప్టెంబర్లో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్ను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో గతేడాది సౌతాఫ్రికాతో రద్దయిన మూడు వన్డేల సిరీస్ను టీ20 సిరీస్గా మళ్లీ నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. కానీ ఐపీఎల్ సెకండాఫ్ విండో కోసం ఈ సిరీస్ను రద్దు చేసుకుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.ఐపీఎల్కు మించిన ప్రాక్టీస్ ఏదీ లేదని ఆ అధికారి పేర్కొన్నారు.
"సెప్టెంబర్ 18, 19 తేదీలు వీకెండ్ కావడంతో ఆ రెండు రోజుల్లో లీగ్ రీస్టార్ చేయాలనుకుంటున్నాం. లీగ్ పూర్తి చేయడానికి మూడు వారాల సమయం కేటాయించాం. అలా అక్టోబర్ 9 లేదా 10వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ సవరించిన తేదీల్లో 31 మ్యాచ్లు పూర్తి చేయాల్సి రావడంతో 10 డబుల్ హెడర్స్ మ్యాచ్లు నిర్వహించనున్నాం. టీమిండియా ఇంగ్లండ్ పర్యటన సెప్టెంబర్ 14న ముగుస్తుంది. దాంతో ఆ రెండు జట్ల ఆటగాళ్లను ప్రత్యేక ఫ్లైట్లో యూఏఈకి తరలిస్తాం. మిగతా దేశాల ఆటగాళ్లకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఆటగాళ్లందరికీ అక్కడ మూడు రోజుల క్వారంటైన్ ఉంటుంది. ఐపీఎల్ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్ను రద్దు చేస్తున్నాం. అలాగే నవంబర్లో భారత్ వేదికగా న్యూజిలాండ్తో జరగాల్సిన రెండు టెస్టుల సిరీస్ల షెడ్యూల్లో మార్పు ఉంటుంది." అని సదరు అధికారి చెప్పుకొచ్చారు.
ఇక ఐపీఎల్ 2021 సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై, బెంగళూరు ఐదు విజయాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ముంబై ఇండియన్స్ నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది.మిగతా జట్ల ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్వారంటైన్ తర్వాత ఐపీఎల్ సెకండాఫ్ తిరిగి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.