ఇటీవల న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా(Team India) ఇప్పుడు మరో పర్యటనకు రెడీ అయింది. బంగ్లాదేశ్ టూర్ (India Tour Of Bangladesh) కి సిద్ధమైంది. ఆదివారం జరిగే తొలి వన్డేతో భారత్.. బంగ్లాదేశ్ పర్యటనను మొదలుపెట్టనుంది. మూడు వన్డేల సిరీస్లో మూడు మ్యాచ్లు ఢాకాలోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
తొలి వన్డే ఆదివారం జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది. మూడు వన్డే మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14-18 వరకు చట్టోగ్రమ్ వేదికగా తొలి టెస్ట్, డిసెంబర్ 22-26 వరకు ఢాకా వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. రెండు టెస్ట్లు 9.30కు ప్రారంభం కానున్నాయి.
భారత్ తో వన్డే సిరీస్ కు ముందు నవంబర్ 30న ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన వార్మప్ మ్యాచ్ లో తమీమ్ కు గాయమైంది. అతడి గాయాన్ని పరిశీలించిన వైద్యులు తమీమ్ కు రెండు వారాల విశ్రాంతి అవసరమని తేల్చి చెప్పారు. దీంతో తమీమ్ భారత్ తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వన్డే సిరీస్ తో పాటు అతడు తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉంది.