తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. తొలి వన్డే హీరో మెదీ హసన్ మిరాజ్ (83 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. మహ్ముదుల్లా (96 బంతుల్లో 77; 7 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో మెరిశాడు. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లు చెరో 2 వికెట్లు తీశారు.
ఈ సమయంలో సిరాజ్ స్థానంలో ఎవరున్నా ఏం చేస్తారు? సింగిల్ తీసి రోహిత్ కు స్ట్రయిక్ వచ్చేలా చేస్తాడు. అయితే ఇక్కడ సిరాజ్ సింగిల్ తీయడానికి తంటాలు పడ్డాడు. ముస్తఫిజుర్ వేసిన తొలి ఐదు బంతులను టచ్ కూడా చేయలేకపోయాడు. ఆఖరి బంతిని మాత్రం కవర్స్ మీద ఆడాడు. ఆ ఓవర్ లో సిరాజ్ సింగిల్ తీసి రోహిత్ కు స్ట్రయికింగ్ ఇచ్చి ఉంటే భారత్ తప్పకుండా గెలిచి ఉండేది.