హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

బంగ్లాపై వామప్ మ్యాచ్‌లో భారీ విజయం... టీమిండియా ఫామ్‌లోకి వచ్చినట్టేనా...

బంగ్లాపై వామప్ మ్యాచ్‌లో భారీ విజయం... టీమిండియా ఫామ్‌లోకి వచ్చినట్టేనా...

క్రికెట్ వరల్డ్ కప్ 2019: మొదటి వామప్ మ్యాచ్‌లో పటిష్ట న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విశ్వరూపం ప్రదర్శించింది. కెఎల్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత సెంచరీలతో చెలరేగడంతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. బౌలర్లు కూడా చక్కగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మొదటి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోవడం టీమిండియాను కలవరబెడుతున్న విషయం. అదీగాక వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు బంగ్లాపై భారీ విజయం నమోదుచేసి ఉత్సాహం నింపుకున్నా, ప్రపంచకప్ హాట్ ఫెవరేట్ అనే స్థాయి ఆటతీరును మాత్రం చూపించలేకపోయింది భారత జట్టు.

Top Stories