ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్కల్లమ్ (Brendon Mccullum) ఎంపైకన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ హెడ్ కోచ్ అయిన మెక్కలమ్ను ఇంగ్లాండ్ జట్టుకు కూడా కోచ్గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటనతో ఆ ప్రచారం నిజమైంది. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. గత కొద్దిరోజులుగా మెక్కలమ్తో జరిపిన సుధీర్ఘ చర్చల అనంతరం..నియామకాన్ని ప్రకటించారు.
ఏడాది కాలంగా ఇంగ్లాండ్ జట్టును పరాజయాలు వెంటాడుతున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్తో ఓడటం.. యాషెస్ సిరీస్లో ఆసీస్ చేతిలో 4-0 ఘోర పరాజయాన్ని చవిచూడం వల్ల జట్టుతోపాటు బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతకు ముందు భారత్ జరిగిన సిరీస్లో ఇంగ్లాండ్ టీమ్ ఓడిపోయింది. దీంతో దిద్దు బాటు చర్యలకు దిగింది ఈసీబీ.
అందులో భాగంగానే ఇటీవల జో రూట్ను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను కొత్త కెప్టెన్ గా నియమించింది. తాజాగా కొత్త హెడ్కోచ్ను తీసుకొచ్చింది.జూన్లో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్లో పర్యటించనుంది. మూడు టెస్టుల నిమిత్తం కివీస్.. ఇంగ్లాండ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే స్టోక్స్ ఇంగ్లాండ్ సారథిగా బాధ్యతలు చేపడతాడు.
ఇప్పుడు మెక్ కల్లమ్.. ఇంగ్లాండ్ హెడ్ కోచ్గా నియామకమైన నేపథ్యంలో.. న్యూజిలాండ్ జట్టు పర్యటన సందర్భంలో సొంత జట్టుకు వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టులో టెస్ట్, పరిమిత ఓవర్ల క్రికెట్ లో వేర్వేరు సారథులు ఉంటారు. ఇక, మెక్ కల్లమ్ ఈ బాధ్యతలు తీసుకోవడంతో.. కేకేఆర్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయడం ఖాయం.
టెలిగ్రాఫ్.యూకే కథనం ప్రకారం 2 యూరో మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 18.88 కోట్లు) మెక్కల్లమ్తో నాలుగేళ్ల కాలానికి ఈసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక హెడ్కోచ్కు ఈసీబీ ఇంత మొత్తంలో చెల్లించడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఆటగాళ్లకు ఎంత చెల్లిస్తామనేది గ్రేడ్స్ ప్రకటించే క్రికెట్ బోర్డులు కోచ్లకు ఎంత చెల్లిస్తున్నామనేది ఎక్కడా బహిరంగపరచలేదు. అయితే మెక్కల్లమ్పై ఉన్న నమ్మకంతోనే ఈసీబీ అతనికి పెద్ద మొత్తం చెల్లిస్తుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది ఇంగ్లండ్ జట్టు. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.