ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధ సమయంలో రూ.10వేలు అందించనున్నారు. ఈ పథకంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.