ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 ఏళ్లు పూర్తయింది. భారతదేశ స్వాతంత్ర్య కోసం మహాత్మాగాంధీతోపాటు ఎందరో మహానుభావులు పోరాడి.. 1947 ఆగస్టు 15 బానిస సంకెళ్లను తెంచి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారు. అప్పటి వివరాల ప్రకారం పరిశీలిస్తే.. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినపుడు ప్రతీ భారతీయుడు ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. కానీ ఆ సంబరాలలో మహాత్మా గాంధీ పాల్గొనలేదు. దీనికి గల కారణం ఏంటంటే.. మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు. (Image: Getty Images)
ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్లు మహాత్మాగాంధీకి లేఖ రాశారు. అందులో ఆగస్టు 15 మన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం అవుతుంది. ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని లేఖలో గాంధీజీని కోరారు. అయితే దానికి స్పందించిన మహాత్మాగాంధీ కలకత్తాలోని హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను. ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తా అని అక్కడే ఉన్నారు. ఇలా జాతిపిత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొనలేదు. (Image: Getty Images)
జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని ఆగస్టు 14న అర్థరాత్రి వైస్రాయ్ లాంజ్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుంచి ఇచ్చారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ, గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు. లార్డ్ మౌంట్బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్లో ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. (Image: Getty Images)
అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కానీ, 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్సభ క్రటేరియట్లోని పత్రాల ప్రకారం 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు. బారతేశానికి స్వాతంత్య్రం రావడానికి కారణం 1947 ఆగస్టుకు మిత్ర దేశాల సేనల ముందు జపాన్ లొంగిపోయి అప్పటికే రెండేళ్లు అయింది. (Image: Getty Images)
ఈ సందర్భంగానే భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 15 వరకు కూడా భారతదేశానికి, పాకిస్థాన్ కు మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్క్లిఫ్ లైన్గా ప్రకటించారు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి విముక్తి లభించింది కానీ.. జాతీయ గీతం మాత్రం 1950లో గౌరవాన్ని పొందింది. (Image: Getty Images)