ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ జిల్లాలోని జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో లక్నో, ఉన్నావ్ సరిహద్దులో ఉన్న ఆలయం అనేక రహస్యాలను కలిగి ఉంది. పురాతన కాలం నుంచి ఈ ఆలయం ప్రాముఖ్యత సంతరించుకుంది.
2/ 7
పురాతన శివాలయాలలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం పురాతన కాలం నుంచి ప్రజల విశ్వాస కేంద్రంగా ఉంది. ఇక్కడ శివుడు కోరిన కోర్కెలను తప్పకుండా నెరవేరుస్తాడని ప్రజల నమ్మకం.
3/ 7
అందుకే ఏడాది పొడువునా భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. అలాగే.. సావన్ మాసంలో, రాయ్ బరేలీ, చుట్టుపక్కల జిల్లాల నుండి వేలాది మంది భక్తులు శివుడిని చూడటానికి వస్తారు.
4/ 7
ఇక్కడ ఏం కోరినా తప్పకుండా నెరవేరుతుందని ప్రజల నమ్మకం.
5/ 7
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఔరంగజేబు తన సైన్యంతో ఇక్కడకు వచ్చాడని ఓ కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ పూజారులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
6/ 7
ఈ శివలింగాన్ని తవ్వమని తన సైనికులను ఔరంగజేబు ఆదేశించాడట. అయితే శివలింగం తవ్వే సమయంలో, మొఘల్ సైనికులపై ఆ లింగం నుంచి వచ్చిన ఓ రక్తం దాడి చేసిందట. ఈ దాడిలో గాయపడిన మొఘల్ సైనికులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
7/ 7
సమాచారం తెలిసిన వెంటనే ఔరంగజేబు శివునికి క్షమాపణ చెప్పి ఇక్కడ ఒక మఠాన్ని స్థాపించాడని తెలుస్తోంది. భీమశంకర్ నుంచి భావ్రేశ్వర్ అనే పేరు అలా వచ్చిందరి పూజారులు చెబుతున్నారు.