మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా పార్టీల పవర్ గేమ్ మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రచారం జరుగుతున్న వేళ మధ్యలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI)కి చెందిన కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఎంట్రీ ఇచ్చారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్తో రాందాస్ అథవాలే ఫోన్లో మాట్లాడారు. అధికారం పంచుకునే విషయంలో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. ఈయన కొత్తగా 3-2 ఫార్ములాను తెరపైకి తెచ్చారు. బీజేపీ మూడేళ్లు, శివసేనకు రెండేళ్ల సీఎం పదవి ఉంటే ఓకేనా.. అని అడిగారు. ఐతే ఆ ఫార్ములాకు బీజేపీ ఒప్పుకుంటే తాము కూడా ఆలోచిస్తామని సంజయ్ రౌత్ చెప్పినట్లు అథవాలే తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిపై త్వరలోనే బీజేపీతో చర్చిస్తానని చెప్పారు.
చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉండాలంటూ శివసేన పెట్టిన కండిషన్కు బీజేపీ ఒప్పుకోలేదు. అసెంబ్లీ గడువు ముగిసే లోపు తమకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో బీజేపీ చేతులెత్తేసింది. ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం..అసెంబ్లీ గడువు ముగియడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు.