India Covid Updates : తగ్గుతోన్న కరోనా ఉధృతి.. కొత్తగా 16,167 వేల కేసులు, 41 మరణాలు..
India Covid Updates : తగ్గుతోన్న కరోనా ఉధృతి.. కొత్తగా 16,167 వేల కేసులు, 41 మరణాలు..
దేశంలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత నాలుగు రోజులుగా రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే డైలీ పాజిటివిటీ రేటు మళ్లీ పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ (ఆగస్టు 8, సోమవారం) వెల్లడించిన గణాంకాల వివరాలివే..
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 2,63,419 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 16,167 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,41,61,899కు చేరాయి. ఇప్పటిదాకా జరిపిన టెస్టుల సంఖ్య 87.81 కోట్లకు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
గడిచిన 24 గంటల్లో 15,549 మంది బాధితులు కొవిడ్ బారినుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తద్వారా ఇప్పటి వరకు కరోనా నుంచి 4,34,99,659 మంది బాధితులు కోలుకున్నట్లయింది. జాతీయ రికవరీ రేటు 98.50 శాతంగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
దేశంలో కొవిడ్ పాజిటివిటీ రేటు స్వల్పంగా పెరిగింది. కిందటి రోజు 5.02 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 6.14 శాతానికి పెరిగినట్లు సోమవారం నాటి బులిటెన్ లో పేర్కొన్నారు. వీక్లీ పాజిటివిటీ రేటు 4.64 శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
గడిచిన నాలుగు రోజుల్లో కొత్త కేసులు తగ్గుతూ రాగా, రికవరీలు పెద్దగా పెరగలేదు. దీంతో యాక్టివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నట్లయింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,510గా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 0.31శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి వల్ల 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 5,26,730 మంది కొవిడ్ వ్యాధికి బలయ్యారు. దేశంలో మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా నిన్న ఒక్కరోజే 34,75,330 డోసుల టీకాలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 206.56 కోట్ల కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొత్తగా 5,56,051 మంది వైరస్ బారినపడగా.. మరో 780 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,93,03,819కు చేరింది. ఇప్పటివరకు వైరస్తో 64,36,397 మంది మరణించారు. (ప్రతీకాత్మక చిత్రం)