Corona updates: వ్యాక్సిన్లు వేసే విషయంలో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా కోటికి పైగా వ్యాక్సిన్లు వేసింది. రాత్రి 10 గంటల నాటికి ఒక్క రోజులో వేసిన డోసుల సంఖ్య 1,00,64,032కి చేరింది. ఒక్క రోజులో ఎక్కువ వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ టాప్కి చేరింది. ఈ కారణంగా ఆగస్టులో ఇప్పటివరకూ 15 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేసినట్లైంది. ఒకే నెలలో ఇన్ని వ్యాక్సిన్లను ఇండియా ఎప్పుడూ వెయ్యలేదు. జులైలో రికార్డు 13.45 కోట్ల డోసులుగా ఉంది. జూన్లో 11.97 కోట్ల డోసులు పడ్డాయి. తాజా రికార్డుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం, కరోనా వారియర్లకు విషెస్ చెప్పారు. (image credit - twitter - reuters)
జులై 21 నాటికి ప్రపంచంలో ఎక్కువ వ్యాక్సిన్ డోసులు వేసిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. చైనా మొదటిస్థానంలో ఉంది. ఆగస్టులో 17 కోట్ల డోసులు, సెప్టెంబర్లో 20 కోట్ల డోసులు వేసేలా కేంద్రం, రాష్ట్రాలు ప్లాన్ వేసుకున్నాయి. ఆగస్ట్ 21-27 వరకూ... ఒక్క వారంలో అత్యధికంగా 4.5 కోట్లకు పైగా టీకాలు వేశారు. ఫలితంగా ఆగస్టులో ప్రతి వారం 3.5 కోట్ల డోసులు వేసినట్లైంది. ఈ నెలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ డోసులు పడ్డాయి. ఉత్తరప్రదేశ్ ఈ నెలలో 2.15 కోట్ల డోసులు వేసింది. ఈ నెలలో వేసిన 15 కోట్ల డోసుల్లో దాదాపు 10 కోట్లను 18-44 ఏళ్ల మధ్య వారికే వేశారు. (image credit - twitter - reuters)
ఇండియాలో కొత్తగా 32,988 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,18,21,428కి చేరింది. రికవరీ రేటు 97.6 శాతానికి పెరిగింది. ప్రస్తుతం భారత్లో 3,44,899 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,24,931 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 51 కోట్ల 49 లక్షల 54 వేల 309 టెస్టులు చేశారు. కొత్తగా 79,48,439 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 61 కోట్ల 22 లక్షల 08 వేల 542 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter - reuters)
ఇండియాలో 24 గంటల్లో యాక్టివ్ కేసులు 11.4వేలు పెరిగాయి. వరుసగా మూడో రోజు యాక్టివ్ కేసులు పెరిగాయి. కొత్త కేసులు కొత్త వరుసగా రెండో రోజు 40వేల కంటే ఎక్కువ వచ్చాయి. దేశంలోనే అత్యధికంగా కేరళలో కొత్త కేసులు 30.08వేలు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 5.1వేలు, తమిళనాడులో 1.56వేలు వచ్చాయి. దేశంలోనే అత్యధికంగా కేరళలో కొత్త మరణాలు 162 రాగా... ఆ తర్వాత మహారాష్ట్రలో 159, ఒడిశాలో 66 వచ్చాయి. ప్రస్తుతం 16 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ముందు వారం కంటే... ఈ వారం కొత్త కేసులు 1 శాతం పెరిగాయి. ప్రపంచ దేశాల్లో 0.8 శాతం తగ్గాయి. దేశంలో టెస్టుల పాజిటివిటీ రేటు 62 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది. టెస్టుల పాజిటివిటీ రేటు (వారం లెక్కలో) దేశంలోనే ఎక్కువగా కేరళలో 17.57 శాతం ఉండగా... మణిపూర్లో 10.77 శాతం, సిక్కింలో 9.63 శాతం ఉంది. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 68,865 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,515 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20,09,245కి చేరింది. కొత్తగా 10 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,788కి చేరింది. కొత్తగా 903 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,80,407కి చేరింది. ప్రస్తుతం 15,050 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,64,06,811 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 339 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,56,794కి చేరాయి. కొత్తగా 417 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,46,761కి చేరింది. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు మరణించారు. మొత్తం మరణాలు 3,867కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,166 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 7,01,623 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 21.61 కోట్లు దాటింది. కొత్తగా 9,762 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 44.97 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.85 కోట్లు ఉన్నాయి. ఇవి మరింత పెరిగాయి. అమెరికాలో కొత్తగా 1,81,451 కేసులు, 1,266 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 27,345 కొత్త కేసులు, 721 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)
నిన్న రోజువారీ ఎక్కువ కేసులు అమెరికాలో వచ్చాయి. ఆ తర్వాత ఇండియా, బ్రిటన్ (38,046)లో వచ్చాయి. ఆ తర్వాత ఇరాన్ (36,279), బ్రెజిల్ లో వచ్చాయి. నిన్న రోజువారీ ఎక్కువ మరణాలు అమెరికాలో వచ్చాయి. ఆ తర్వాత మెక్సికో (835), రష్యా (798), బ్రెజిల్ (721), ఇండొనేసియా (599)లో వచ్చాయి. (image credit - twitter - reuters)