ఇండియాలో కొత్తగా 14,256 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,06,39,684కి చేరింది. నిన్న 152 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,53,184కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. నిన్న 17,130 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1,03,00,838కి చేరింది. దేశంలో రికవరీ రేటు 96.8 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,85,662 ఉన్నాయి. నిన్న దేశంలో 8,37,095 టెస్టులు జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 19,09,85,119కి చేరింది. (image credit - NIAID)