బీజేపీ అతిముఖ్యమైన రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ గెలుపు చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ సత్తా మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మోదీ వారసుడిగా పలు వర్గాల్లో అభిప్రాయం ఉంది. యోగీ పాలనలో మెరుపులు లేకున్నా.. శాంతి భద్రత, అవినీతి లేని పాలన బీజేపీకి మెరిట్. లఖింపూర్ వంటి ఘటనలతోపాటు, ప్రతిపక్షాల లోపాయికారి ఒప్పద్దాలు బీజేపీ గెలుపును ప్రభావితం చేయనున్నాయి. (Image: News18 Creative)
గత ఏడాది నాలుగు నెలల్లో రాష్ట్రంలో మూడుసార్లు ముఖ్యమంత్రులను మార్చాల్సిన భాజపాకు గట్టి పోటి ఎదురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో 40శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించి కొత్త వారితో పోటీలో నిలబడనుందని సమాచారం. 70 సీట్లు ఉంటే ఉత్తరాఖండ్లో ఈ సారి బీజేపీ గట్టిపోటీ తప్పదు. (Images: News18 Creative)
గోవాలో ఈ సారి రాజకీయం చాలా వేడెక్కింది. ఆప్, టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలో బరిలో ఉన్నాయి. బీజేపీ నుంచి అధికారం లాక్కోవాలి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్కు ఆప్, టీఎంసీ రావడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. గతంలోనే బొటా బొటిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఈ సారి కూడా అధికారం అంత సులభం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. (Images: News18 Creative)
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) , పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా (Goa) మరియు మణిపూర్తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. ఈ రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమైనవి. ఎందుకంటే ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ (BJP) అధికారంలో ఉంది.