5 State Elections: దేశవ్యాప్తంగా ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈసారి గెలుపు ఎవరిది అన్నది హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఇవాళ ఒకే దశలో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఓటు వేయడానికి సామాన్యులతో పాటు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ వంటి సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు అభిమానులకు ఓటు వేయమని పిలుపునిచ్చారు.