ఇక అది అలా ఉంటే లైగర్ పరాజయం తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా ఖుషి సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఇటీవలే రీస్టార్ట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ షూట్కు సమంత కూడా హాజరైయ్యారట. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ తాజా షెడ్యూల్లో దర్శకుడు శివ నిర్వాణ హీరో, హీరోయిన్స్పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. Photo : Twitter
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మలయాళీ సినిమా హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 23, 2022న థియేటర్లలో విడుదల కానుంది. Photo : Twitter
ఇక ఖుషి సినిమా తర్వాత విజయ్.. మరోసారి ప్రేమ కథనే చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న దిల్ రాజు ప్రాజెక్ట్ను ఓకే చేసేశారట విజయ్. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఈ సినిమా కూడా ప్రేమకథేనని అంటున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే విజయ్తో సినిమా పట్టాలేక్కనుందని తెలుస్తోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చింది. అయితే ఏవో కారణాల వల్ల ఈ సినిమా ముందుకు సాగలేదు. Photo : Twitter
ఇక లైగర్ విషయానికి వస్తే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannnadh) దర్శకత్వంలో కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ (Liger). అనన్యపాండే హీరోయిన్గా నటించారు. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్తో మంచి బజ్ను క్రియేట్ చేసుకుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. Photo : Twitter
దేశవ్యాప్తంగా విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుందని భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది.. సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథాకథనాలు బలంగా లేవని, చెత్త సినిమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సినిమాను చూసిన ప్రేక్షకులు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఎక్కువుగా పూరీ జగన్నాథ్ను తప్పుబడుతున్నారు నెటిజన్స్. Photo : Twitter
దీంతో పూరి ఫ్యాన్స్ లైగర్ విషయంలో సంతృప్తి చెందలేకపోయారు. ఇక విజయ్ ఎంత కష్టపడిన.. ఛార్మి ఎంత ఖర్చు పెట్టిన సినిమాలో దమ్ము లేనప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నిరే అవుతుంది కదా అంటున్నారు నెటిజన్స్. అయితే ఇందులో ఒక్కరి తప్పిందం ఏమీ లేదని.. సినిమా అంటేనే టీమ్ వర్క్..కాబట్టి.. పూరీని తప్పుబట్టడం కూడా సరైంది కాదని మరికొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే లైగర్ నష్టం 25 కోట్ల వరకు ఉండోచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా లైగర్ కారణంగా భారీ ధరకు ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు దర్శకుడు పూరి డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ వినిపడుతోంది. దర్శకుడు పూరి మాట మీద నిలబడే వ్యక్తి అని, లైగర్ కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లలతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది.Photo : Twitter
ఇక అది అలా ఉంటే మరోవైపు కర్ణుడి చావుకు వెయ్యి కారణాల చందంగా.. ఈ సినిమా మరో చెత్త రికార్డ్ను మూట గట్టుకుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ సైట్ IMDb(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) రేటింగ్లో లైగర్ సినిమాకు అతి తక్కువ రేటింగ్ వచ్చింది. అది చూసిన విజయ్ అభిమానులు షాక్ అవుతున్నారు. లైగర్ సినిమాకు ఐఎండిబిలో 10 పాయింట్స్కు కేవలం 1.7 రేటింగ్ మాత్రమే వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇటీవల విడుదలైన డిజాస్టర్గా మారిన తమిళ సినిమా ది లెజెండ్ (4.7), అమీర్ ఖాన్ హిందీ లాల్ సింగ్ చడ్డా(5), తెలుగు సినిమా సన్ ఆఫ్ ఇండియాకు (5) కంటే తక్కువ రేటింగ్ నమోదు చేయడమేంటనీ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. Photo : Twitter
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ 11 కోట్ల మార్క్ని అందుకుంటుంది అనుకున్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం మీద 9.57 కోట్ల రేంజ్లో షేర్ని మాత్రమే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్గా ఈ సినిమా 13.45 కోట్ల షేర్ అందుకుంది... Photo : Twitter
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేతులేత్తేసిన లైగర్ హిందీ బెల్ట్లో మాత్రం అదరగొట్టింది. ఈ సినిమా ప్రీమియర్స్తో కలిపి హిందీలో ఫస్ట్ డే సుమారు 6 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ సినిమాకి హిందీలో అదిరే ఓపెనింగ్స్ దక్కినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. పుష్ప, రాధేశ్యామ్, బాహుబలి1 సినిమాలకు కూడా ఫస్ట్ డే ఈ రేంజ్లో రాలేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.. సినిమా టాక్ బాగుట్టే అదరగొట్టేదని అంటున్నారు. Photo : Twitter
ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రెండో రోజు అసలే పడిపోయింది. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో 1.5 షేర్ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 17.51 షేర్.. 33. 50 కోట్ల గ్రాస్ను అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 90 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగగా ఈ రెండు రోజుల కలెక్షన్స్ కాకుండా మరో 72.49 కోట్ల రేంజ్లో షేర్ ని ఇంకా సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మూడో రోజు కూడా అదే పరిస్థితి... Photo : Twitter
ఇక ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా నిడివి కూడా కాస్తా తక్కువుగానే ఉంది. ఈ సినిమా రెండు గంటల 20 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అందులో భాగంగా ఒక్క నైజాం ఏరియాకే థియేట్రికల్ రైట్స్ 30 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. వరంగల్ శ్రీను ఈ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ను తీసుకున్నారు.. Photo : Twitter
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముతూ జీవనం గడిపే కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా మారాడనేదే కథ. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు.. Photo : Twitter
ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వచ్చింది. లైగర్ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్తో కలిసి నిర్మించారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. . Photo : Twitter
పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. ఇక విజయ్, సమంతలు కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.. Photo : Twitter