Unstoppable 2 - NBK - PSPK: నందమూరి, మెగాభినులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్తో బాలయ్య అన్స్టాపబుల్ షో ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ ఎపిసోడ్లో సాయి ధరమ్ తేజ్ కూడా సందడి చేయనున్నారు. ఇతనితో పాటు అక్కినేని భామ నందమూరి, మెగా హీరోల ఎపిసోడ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలువనుంది. (Twitter/Photo)
నందమూరి, మెగాభినులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. నందమూరి నట సింహా బాలయ్య హోస్ట్గా నిర్వహిస్తోన్న అన్స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. టాలీవుడ్లో నందమూరి, మెగా ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేస్తోన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక వేదికపై కనిపించడంపై ఇరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆహా వేదికగా బాలయ్య అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. అన్ స్టాపబుల్ షో టాప్ రేంజ్ కు వెళ్లింది. ఈ షోలో సాయి ధరమ్ తేజ్ పంచ కట్టులో హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈ షోలో పవన్ కళ్యాణ్తో హరిహరవీరమల్లు సినిమాను తెరకెక్కిస్తోన్న క్రిష్ పాల్గొన్నారు. ఒక హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ ఎపిసోడ్ మధ్యలో వీడియో కాల్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లతో ముచ్చటించింది. అంతేకాదు హరిహరవీరమల్లులో పవన్తో నటించడంతో పాటు చిత్ర విశేషాలను పంచుకున్నారు నిధి అగర్వాాల్.(Twitter/Photo)
ముఖ్యంగా ప్రత్యర్థులు పవన్ మూడు పెళ్లిళ్ల ఇష్యూను బాలయ్య అడగటం ఈ షోలో హైలెట్గా నిలవనుంది. దానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. దాంతో పాటు రాజకీయంగా ప్రజారాజ్యం.. ఈ తర్వాత జనసేన పార్టీని ఎందుకు స్థాపించాల్సి వచ్చిందనే విషయం ఇందులో హైలెట్గా నిలవనున్నట్టు సమాచారం. (File/Photo)
ఇక ప్రజా రాజ్యం పార్టీ స్థాపించినపుడు యువ రాజ్యం అధినేతగా పవన్ కల్యాణ్ అప్పటి కాంగ్రెస్ నేతలను పంచ లూడదూసి కొడతారన్న చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ ఇష్యూపై బాలయ్య క్వశ్చన్ అడిగినట్టు సమాచారం. ఈ షోలో బాలయ్యను పవన్ కళ్యాణ్.. బాలయ్య గారు అని సంభోదించినట్టు సమాచారం. మరోవైపు బాలయ్య.. పవన్ను భయ్యా అంటూ పిలవడం ఈ షోలో హైలెట్ అని చెప్పొచ్చు. తొలిసారి వీళ్లిద్దరు సుస్వాగతం సినిమా ప్రారంభోత్సవంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా నేను యంగ్గా ఉన్నానంటూ బాలయ్య అనడం.. ఇప్పటికీ యంగ్గా కనిపిస్తున్నావు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం ఇరు హీరోల అభిమానులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. (File/Photo)
ఇంకోవైపు ఈ షోలో చిరంజీవి నుంచి ఏమి నేర్చుకున్నావు. ఏమి నేర్చుకోకూడదనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాలకు సంబంధించిన విషయాలనే ఎక్కువగా ప్రస్తావించినట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ ను ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేసినట్టు ఈ షోలో బాలయ్య ఆసక్తికర ప్రశ్నలు అడినట్టు సమాచారం. (File/Photo)
టీడీపీ నేత కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్గా నిర్వహిస్తోన్న అన్స్టాపబుల్ షోలో జనసేనాని పాల్గొనడం సినీ, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.సెకండ్ సీజన్లో ఇది లాస్ట్ ఎపిసోడ్.. ఇది రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానుంది. (File/Photo)
ఈ టాక్ షోలో ముఖ్యంగా టీడీపీ, జనసేనతతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. దీనిపై పవన్.. సమాధానం దాటవేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీలో ఈ మూడు పార్టీలు కలిస్తే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ని ఓడించడం సాధ్యం అనే అభిప్రాయాలు టీడీపీ, జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకు అన్స్టాపబుల్ వేదిక కానున్నట్టు సమాచారం. (Twitter/Photo)
ఏది ఏమైనా సినీ రంగంలో భిన్న ధృవాలైన విభిన్న ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు లెగసీ ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఒక షోలో కలుసుకోవడం మాములు విషయం కాదు. వీళ్లిద్దరి మధ్య రాజకీయంతో పాటు సినీ రంగానికి సంబంధించిన విషయాలతో పాటు వీళ్లిద్దరి మధ్య ఉన్న పర్సనల్ అనుబంధం కూడా ఈ షోలో ఎక్కువగా ప్రస్తావించినట్టు సమాచారం. (Photo Twitter)
అన్స్టాపబుల్ సీజన్ 2లో పవన్ కళ్యాణ్తో పాటు దర్శకుడు క్రిష్ పూర్తి స్థాయిలో ఎపిసోడ్లో ఉన్నారు. త్రివిక్రమ్ షూటింగ్ స్పాట్కు వచ్చిన ఈ షోలో పార్టిసిపేట్ చేయలేదు. మరోవైపు బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో పాటు సాయి ధరమ్ తేజ్ ఈషోలో పంచ కట్టుతో సందడి చేసినట్టు సమాచారం. ఇంకోెవైపు ఈ షోలో బాలయ్య. బాబాయి పవన్ కళ్యాణ్ విషయమై రామ్ చరణ్కు కాల్ చేయడం హైలెట్. అటు పవన్ తనయుడు అకిరానందన్ సినీ ఎంట్రీపై బాలయ్య ఓ ప్రశ్న సంధించినట్టు సమాచారం. మొత్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయం అందుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ మార్చి 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా దసరాకు పోస్ట్పోన్ అయినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ మూవీ రెండు భాగాలుగా రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ పై నందమూరి, మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (Photo twitter)